త్వరలోనే నరేంద్ర మోడీ బయోపిక్ “విశ్వనేత”…

-

“ముచ్చటగా మూడోసారి కూడా భారత దేశ పాలనా పగ్గాలు చేపట్టడం కేవలం లాంఛనం” అనే అంచనాల నడుమ ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ తెరకెక్కనున్నట్లు సమాచారం. “విశ్వనేత” పేరుతో అన్ని భారతీయ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు తెరకెక్కించనున్నారు.ఈ సినిమాకి యువ ప్రతిభాశాలి సి.హెచ్.క్రాంతి కుమార్ దర్శకత్వం వహించనున్నారు.

Prime Minister Narendra Modi reached Ayodhya
Prime Minister Narendra Modi reached Ayodhya

ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వందే మీడియా ప్రయివేట్ లిమిటెడ్’ పతాకంపై కాశిరెడ్డి శరత్ రెడ్డి నిర్మించనున్నారు. అనుపమ్ ఖేర్,అభయ్ డియోల్, నీనా గుప్తా, పల్లవి జోషి తదితరులు కీలకపాత్రల్లో నటించనున్నారు.ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామ మందిర నిర్మాణం,డిమోనిటైజేషన్, జి.ఎస్.టి వంటి ఎన్నో సంచలనాలతో దేశంలో కోట్లాది మంది గుండెల్లో కొలువుదీరి.. “యూనిఫామ్ సివిల్ కోడ్” అమలు దిశగా అడుగులు వేస్తున్న మోడీ బయోపిక్ లో చాయ్ వాలా స్థాయి నుంచి “విశ్వనేత” గా ఎదిగిన ఆయన మహాప్రస్థానానికి దృశ్యరూపం ఇవ్వనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news