నాటి సిక్కుల ఊచకోత కేసులో యావజ్జీవ కారాగార శిక్షకు గురైన కాంగ్రెస్ మాజీ నేత సజ్జన్కుమార్ ఢిల్లీ హైకోర్టును గురువారం ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల ఎదుట తాను లొంగిపోయేందుకు మరో నెల రోజుల సమయం కావాలని తన పిటీషన్ లో పేర్కొన్నారు. 1984 ఘర్షణల్లో అనేక మంది సిక్కులను ఊచకోత కోసిన కేసులో సజ్జన్కుమార్ను ఢిల్లీ హైకోర్టు దోషిగా నిర్దారించి ఇటీవలే ఆయనకు జీవిత ఖైదును విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ నెల 31 లోగా పోలీసులకు లొంగిపోవాలని సజ్జన్ కుమార్ ని న్యాయస్థానం ఆదేశించింది. తనకు ముగ్గురు పిల్లలు, ఎనిమిది మంది మనుమలు, మనవరాళ్లు ఉన్నారని, తనకు సంబంధించిన ఆస్తులను వారికి అప్పగించాల్సిన అవసరం ఉందని, అందుకు జనవరి 31 వరకు గడువునివ్వాలని కోర్టును కోరారు. పిటీషన్ పై శుక్రవారం విచారించనున్నట్లు సమాచారం.
నేను లొంగిపోతా..కానీ…
-
Previous article
Read more RELATEDRecommended to you
బీఆర్ఎస్ కార్యకర్తకు కేసీఆర్ గుడ్ న్యూస్.. ఏకంగా 10 కోట్లు !
బీఆర్ఎస్ కార్యకర్తకు కేసీఆర్ గుడ్ న్యూస్.. చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు...
IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ పై లక్నో గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో నిన్న కీలక మ్యాచ్ జరిగిన సంగతి...
టచ్ లోకి 25 మంది కాంగ్రెస్ ఎమ్యెల్యేలు… మళ్ళీ సీఎం కేసీఆరే !
25 మంది కాంగ్రెస్ ఎమ్యెల్యేలు టచ్ లో ఉన్నారని... కేసీఆర్ సంచలన...