భర్తకు పగ్గాలు అప్పగించి ఆ లేడీ ఎమ్మెల్యే సైలెంటయ్యారా ?

-

ఓ ఎమ్మెల్యేకు వ్యాపారాలు దెబ్బతింటాయని భయం. మరో ఎమ్మెల్యే భర్తకు పగ్గాలు అప్పగించి సైలెంట్‌ అయిపోయారు. ఉద్దండులైన నాయకులు ఉన్నా..గోదావరి జిల్లా టీడీపీ కేడర్‌లో జోష్‌ లేదు. గెలిచిన ఏడాదిలోనే డీలా పడిపోయారు. భవిష్యత్‌ లేదని బెంగపెట్టుకున్నారో ఏమో కానీ.. చాలా మంది నాయకులు, కార్యకర్తలు అధికార పార్టీలో జంప్‌ చేయడానికి ప్లాన్స్‌ వేసుకుంటున్నారట.

తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి సీనియర్‌ నాయకుల అండ ఉన్నా.. తెలుగు తమ్ముళ్లల్లో మునుపటి జోష్‌ లేదు. ఏడాది అయినా వైసీపీ ఇచ్చిన షాక్‌ నుంచి ఇంకా తేరుకోలేదని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా అంటే రాజకీయాలు వేడివేడిగా ఉండేవి. ఇప్పుడు నేతలు పట్టించుకోవడం లేదని.. కేడర్‌లోనూ ఆ ఉత్సాహం చచ్చిపోయిందని అంటున్నారు.

రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పార్టీ పగ్గాలను, ఎమ్మెల్యేగా చేయాల్సిన పనులను తన భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు అప్పగించేశారని టాక్‌. భవానీ ఏ కార్యక్రమాలకూ రావడం లేదు. నాలుగు నెలలుగా ఇక్కడ ప్రజలకు ముఖం చాటేశారని అనుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓటు వేసి చంద్రబాబు ఆగ్రహానికి కారణమయ్యారని సమాచారం. అచ్చెన్న అరెస్ట్‌ తర్వాత నారా లోకేష్‌ శ్రీకాకుళం పర్యటనకు వెళ్లినప్పుడు సోదరుడు రామ్మోహన్‌నాయుడితోపాటు బాబయ్‌ ఇంట్లో కనిపించిన భవానీ మళ్లీ బయటకు రాలేదని అంటున్నారు.

మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఊసు కూడా వినిపించడం లేదు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆయనలో ఉత్సాహం లేదట. పారిశ్రామిక వేత్త కావడం, ప్రతిపక్ష పార్టీలో ఉండటంతో సైలెంట్‌ అయ్యారని టాక్. మూడోసారి గెలిచిన కొత్తలో పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌తో కయ్యానికి కాలుదువ్వినా.. ఇప్పుడు ప్రభుత్వం, పార్టీ కార్యక్రమాలను సైతం ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదట. జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతోపాటు.. మాజీ ఎమ్మెల్యేలంతా ఎక్కడివారు అక్కడే గప్‌చుప్‌ అన్నట్లు ఉన్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news