రేపు ఢిల్లీలో లోక్ సభ ఎన్నికల పై బీజేపీ కీలక సమావేశం

-

రాబోయే లోక్ సభ ఎన్నికలపై రేపు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగే కీలక  సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల నేతలు హాజరు కానున్నారు. తెలంగాణ పార్లమెంట్ స్థానాలను 5 క్లస్టర్ లుగా చేసి ,ఒక్కో క్లస్టర్ కి ఒక్కో నేతకు ఇంఛార్జి గా బీజేపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించనుంది. తెలంగాణ నుండి క్లస్టర్ ఇంఛార్జిలు, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హాజరు కాను.న్నారు. మరుసటి రోజు ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశం కానుంది.

 

 

వచ్చిన ఓట్లను బట్టి అసెంబ్లీ స్థానాలను విభజించి ఎల్లుండి రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులతో సమావేశం కానున్నారు. పార్టీ లో చేరికలు, సంస్థాగత అంశాల పై చర్చించనున్నారు. చేరికల కమిటీకి సమన్వయ కర్త గా చింతల రామచంద్రారెడ్డి వ్యవహరించనున్నారు. ఇదిలా ఉంటే …అధికార కాంగ్రెస్‌ పార్టీతో పాటు.. బీఆర్‌ఎస్‌ నేతలు లోక్ సభ ఎన్నికల్లో అధిక సీట్లు సాధించడానికి కసరత్తులు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news