వృద్ధ దంపతులు దారుణ హత్య..

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. చర్ల బస్టాండ్ సమీపంలో నివసించే పున్నం చుక్కయ్య, యల్లమ్మలు చాకలి పని చేసుకుంటూ వృద్ధ దంపతులు జీవనం సాగిస్తున్నారు,  తెల్లవారుజామున చుక్కయ్య ఇంటిలోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు వృద్ధులపై కత్తులతో విచక్షణారహితంగా నరికారు. ఈ దాడిలో దంపతులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరికి ఐదుగురు కుమారులున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news