ఉత్తరప్రదేశ్‌లో 3 ఏళ్ల బాలికపై 10 ఏళ్ల బాలుడి అత్యాచారం!

-

చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్నారు. ఇదిలా ఉంటే మైనర్లు కూడా అత్యాచారాలకు పాల్పడుతుండటం సమాజాన్ని కలవరపరుస్తోంది. తెలిసీతెలియని వయసులో ఉన్న పిల్లలు కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడటం షాక్ కు గురిచేస్తోంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. తాజాగా 3 ఏళ్ల బాలికను అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై 10 ఏళ్ల బాలుడిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజప్ఫర్‌నగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శనివారం తమ కూతురిని ఆ బాలుడు స్కూల్ భవంతిపైకి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. బాలుడు ఒకటవ తరగతి చదువుతుండగా బాలిక కిండర్‌గార్టెన్‌లో ఉంది. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదును ఉటంకిస్తూ, శనివారం బాలికను పాఠశాల పైకప్పుపైకి తీసుకెళ్లి బాలుడు అత్యాచారం చేశాడని పోలీసులు పేర్కొన్నారు. దేశంలో రోజుకు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news