కరోనా విశ్వరూపం.. భారత్ లో ఒక్క రోజులోనే..!

-

భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా.. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 22,752 కరోనా కేసులు నమోదవ్వగా,

482 మంది మరణించినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇండియాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,42,417కి చేరుకోగా మరణాల సంఖ్య 20,642కి పెరిగింది. కరోనా నుంచి ఇప్పటివరకు 4,56,830 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం 2,64,944 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news