ఏపీలో కొత్త‌గా 141 క‌రోనా కేసులు.. 2 మృతి

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు సంఖ్య రోజు రోజుకు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. తాజా గా ఈ రోజు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేసిన క‌రోనా బులిటెన్ ప్రకారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 11,571 క‌రోనా నిర్ధార‌ణ పరీక్షలు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్షల ఫలితాల్లో కేవ‌లం 141 క‌రోనా వైర‌స్ పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యాయి. అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇద్ద‌రు మృతి చెందారు.

దీంతో దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వైర‌స్ వ‌ల్ల 14,729 మంది బాధితులు మృతి చెందారు. అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ నుంచి 450 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్ర ప్ర‌స్తుతం 2,014 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. కాగ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి దాదాపు గా పూర్తిగా త‌గ్గింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ఆంక్షల‌ను స‌డ‌లించింది. కానీ క‌రోనా నిబంధ‌న‌ల‌ను మాత్రం ప్ర‌జ‌లు పాటించాల‌ని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news