దుబాయ్​లో అగ్నిప్రమాదం.. 16 మంది దుర్మరణం.. మృతుల్లో నలుగురు భారతీయులు

-

దుబాయ్​లో ఆదివారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 16 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో నలుగురు భారతీయులు ఉన్నట్లు ఇక్కడి భారత రాయబార కార్యాలయం అధికారులు తెలిపారు. వారిలో కేరళకు చెందిన భార్యాభర్తలు, మరో ఇద్దరు తమిళనాడు వ్యక్తులు ఉన్నట్లు వెల్లడించారు. అసలేం జరిగిదంటే..?

దుబాయ్​లోని అల్‌-రాస్‌ ప్రాంతంలోని ఓ భవనం నాలుగో అంతస్తులో ఆదివారం అర్ధరాత్రి 12.53 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే మంటలు ఇతర అంతస్తులకు వ్యాపించాయి. ఈ ఘటనలో 16 మంది సజీవదహనం కాగా.. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకుని మంటలు ఆర్పారు.

నిర్మాణ సంస్థ నిబంధనలను ఉల్లంఘించడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. మరికొన్ని మృతదేహాలను గుర్తించాల్సి ఉందని వెల్లడించారు. స్థానిక అధికారులతో సంప్రదింపులు చేస్తున్నామని, మృతదేహాలను భారత్‌కు పంపేందుకు సహకరిస్తామని రాయబార కార్యాలయం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news