ఆజాద్​కు బిగ్​ షాక్.. తిరిగి కాంగ్రెస్​లోకి 17 మంది నేతలు

-

కాంగ్రెస్​ నుంచి బయటకొచ్చి సొంత పార్టీ స్థాపించిన జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్​కు గట్టి షాక్ తగిలింది. ఆజాద్ స్థాపించిన ‘డెమొక్రటిక్​ ఆజాద్ పార్టీ’ను వీడి 17 మంది సీనియర్​ నాయకులు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్ర.. ఈ నెల 20న జమ్ముకశ్మీర్​కు చేరనుంది. దానికి ముందుగా వారంతా సొంత గూటికి రావడం ఎంతో సంతోషకరమైన విషయమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ అన్నారు.

జమ్ముకశ్మీర్​ మాజీ ఉపముఖ్యమంత్రి తారా చంద్​, మాజీ పీసీసీ చీఫ్​ పీర్జాదా మహమ్మద్​ సయ్యద్​, మాజీ ఎమ్మెల్యే బల్వంత్​ సింగ్​ సహా 17 మంది నాయకులు శుక్రవారం దిల్లీ చేరుకుని కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. గాంధీ కుటుంబంతో కశ్మీర్​ ప్రజలకు ప్రత్యేక సంబంధాలు ఉన్నాయని వారు అన్నారు. భావోద్వేగాలు, స్నేహం కారణంగా హడావుడిగా పార్టీని వీడి తప్పు చేశామని వారు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. దీన్ని ఆ నాయకులంతా ‘జీవితంలో చేసిన అతిపెద్ద తప్పుగా’ అభివర్ణించారు. కాంగ్రెస్​ పార్టీని విడిచిపెట్టినందుకు కశ్మీర్​ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్లు ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news