సొంత మరదలిని రేప్ చేసి..దారుణంగా నరికేశాడు !

-

ఉత్తరప్రదేశ్‌లోని బండా జిల్లాలోని అట్రారా ప్రాంతంలో శనివారం సాయంత్రం 17 ఏళ్ల బాలికను ఆమె బావ గొడ్డలితో నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారం చేసి అనంతరం ఆమెను దారుణంగా నరికి చంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతి చెందిన బాలిక మధ్యప్రదేశ్ నివాసిని, తన అక్క ఇంటికి ఆమె చుట్టం చూపుగా వచ్చిందని సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యప్రకాష్ శర్మ తెలిపారు.

శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో, ఆమె బావ ఆమెను గొడ్డలితో చంపి, ఆపై పారిపోయాడు. సంఘటన జరిగిన సమయంలో, నిందితుడు మరియు బాలిక మాత్రమే ఇంట్లో ఉన్నారు అని శర్మ తెలిపారు. దీంతో అతని మీద కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు బృందాలు ఏర్పాటు చేయగా, మృతురాలి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపినట్లు సత్యప్రకాష్ శర్మ తెలిపారు. బాలికపై అత్యాచారం జరిగి హత్య చేసినట్లు తెలుస్తున్నప్పటికీ, పోస్ట్‌మార్టం నివేదిక రాకముందే అధికారికంగా ఏమీ చెప్పలేమని ఆ అధికారి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news