నేడు కేంద్ర కేబినెట్ కీలక భేటీ…

-

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు కేంద్ర కేబినెట్ కీలక భేటీ కానుంది. సాగ చట్టాల రద్దు అంశంపైనే చర్చ జరుగనుంది. ఇటీవల మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కేంద్ర కేబినెట్ వ్యవసాయ చట్టాల రద్దు తీర్మాణాన్ని ఆమోదించే అవకాశం ఉంది. ఈనెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే సాగు చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్న వివిధ బిల్లులపై చర్చ, తీర్మాణాలు పెట్టే అవకాశం ఉంది.

మరోవైపు సాగు చట్టాలు రద్దైతేనే తాము ఇళ్లకు వెళ్తామని భీష్మించుకున్నారు రైతులు. ఢిల్లీ సరిహద్దుల్లో తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. కాగా పార్లమెంట్  సమావేశాల మొదటి రోజే సాగు చట్టాల రద్దు బిల్లును తీసుకురానున్నట్లు తెలుస్తోంది. రైతుల నిరసనలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ముందుగా సాగు చట్టాలను రద్దు చేయాలని కేంద్రం భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news