ఏపీలో నిల‌క‌డ‌గా క‌రోనా.. నేడు కొత్త‌గా 31

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ నిల‌క‌డ‌గా ఉంది. నేడు న‌మోదు అయిన క‌రోనా కేసులు, బుధ వారం వెలుగు చూసిన క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు స‌మానంగా ఉన్నాయి. కాగ ఈ రోజు క‌రోనా వైర‌స్ బులిటెన్ ను ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాసేప‌టి క్రితం విడుద‌ల చేశారు. కాగ ఈ క‌రోనా బులిటెన్ ప్రకారం.. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో కేవ‌లం 31 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

కాగ బుధ వారం కూడా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో 31 క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కాగ ఈ రోజు కూడా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎలాంటి క‌రోనా మ‌రణాలు న‌మోదు కాలేదు. కాగ గ‌త నెల రోజుల నుంచి రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు వెలుగు చూడ‌టం లేదు. అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది క‌రోనా వైర‌స్ బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం 444 క‌రోనా వైర‌స్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ ఈ రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 10,344 క‌రోనా నిర్ధార‌ణ పరీక్షల‌ను నిర్వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Latest news