BREAKING : హైదరాబాద్‌ లో విషాదం..ఒకే ఇంట్లో 4 గురు ఆత్మహత్య

-

BREAKING : హైదరాబాద్‌ లో విషాదం చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో 4 గురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ రాజీవ్ గృహకల్పలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహల్ప లోని ఇంట్లో భార్య, భర్త, ఇద్దరు పిల్లల ఆత్మహత్య చేసుకున్నారు. గత శుక్రవారం నుండి తలుపు వేసివున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ఈ రోజు ఉదయం దుర్గంధం రావడం, ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో తలుపులు పగిలులగొట్టి తెరిచారు స్థానికులు. ఇంట్లో భర్త నాగరాజు , భార్య సుజాత పిల్లలు రమ్యశ్రీ, టిల్లు మొత్తం నలుగురు చనిపోయినట్లు నిర్ధారించారు స్థానికులు. అనంతరం పోలీసులకు తెలిపారు. గత ఏడూ సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్న మృతులు..కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యాకు కారణంగా తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు చందానగర్ పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Latest news