ఆంధ్ర ప్ర‌దేశ్‌లో స్వ‌ల్పంగా పెరిగిన కరోనా.. నేడు 40 కేసులు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ గత కొద్ది రోజుల నుంచి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తుంది. కానీ నేడు.. నిన్న‌టితో పోలిస్తే.. క‌రోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగింది. కాగ ఈ రోజు క‌రోనా వైర‌స్ బులిటెన్ ను ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాసేప‌టి క్రితం విడుద‌ల చేశారు. ఈ క‌రోనా బులిటెన్ ప్ర‌కారం.. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 40 మందికి క‌రోనా వైర‌స్ పాజిటివ్ అని తెలింది.

అయితే నిన్న ఏపీలో 31 కరోనా కేసులు మాత్రమే న‌మోదు అయ్యాయి. అంటే నిన్న‌టితో పోలిస్తే.. నేడు 9 పాజిటివ్ కేసులు పెరిగాయి. కాగ‌ అత్యధికంగా అనంత‌పురం జిల్లాలో 15 కేసులు వెలుగు చూశాయి. అలాగే నాలుగు జిల్లాల్లో జీరో కేసులు న‌మోదు అయ్యాయి. ఈ రోజు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో 55 మంది క‌రోనా వైర‌స్ బాధితులు పూర్తి కోలుకున్నారు.

దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం 429 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే ఈ రోజు కూడా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎలాంటి క‌రోనా మ‌ర‌ణాలు న‌మోదు కాలేదు. కాగ గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 10,515 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Latest news