పూణే జిల్లాలో ఈదురు గాలులకు కూలిన హోర్డింగ్.. ఐదుగురి మృతి

-

దేశవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్న విషయం విదితమే…. కాగా, నేడు కూడా ఈదురు గాలులతో కూడిన వర్షాలు పలుచోట్ల పడ్డాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఈదురు గాలులకు ఐరన్ హోర్డింగ్ కూలిపోవడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పింప్రీ చించ్ వాడ్ టౌన్ షిప్ లోని రావెట్ కివాలే ప్రాంతంలో… ముంబై – పూణే హైవేలో ఈ దుర్ఘటన జరిగింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రాంతంలో కూడా ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో ఆ దారిన వెళ్తున్న పలువురు వాహనదారులు ఈ హోర్డింగ్ కింద నిలబడ్డారు.

5 killed as iron hoarding collapses in Pune

అదే సమయంలో గాలి వాన మరింత ఎక్కువగా రావడంతో హోర్డింగ్ కుప్పకూలింది. దాని కింద తలదాచుకున్న ఐదుగురు ఈ ఘటనలో మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. పలువురికి గాయాలయ్యాయి. ‘గాలి బాగా వీస్తుండటంతో కొంతమంది ఆ ఐరన్ రాడ్ కింద తలదాచుకున్నారు. హఠాత్తుగా ఆ గాలి తాకిడికి హోర్డింగ్ కిందపడిపోయింది. దీంతో ఐదుగురు మృతి చెందారు’ అని పోలీస్ అధికారి పీటీఐతో తెలిపారు. ఐదుగురి మృతదేహాలను వెలికి తీశామని, సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతోందని వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news