బ్రేకింగ్ : మహారాష్ట్రలో భారీ ఎన్‌ కౌంటర్‌…5 గురు మావోయిస్టులు మృతి

-

మహరాష్ట్ర రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. మహరాష్ట్ర రాష్ట్రంలోని… గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ సంభవించింది. గడ్చిరోలి జిల్లా లోని ధనోరా తాలుక గ్యారబట్టి అట వీ ప్రాంతం లో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే.. భీకర కాల్పుల్లో… ఏకంగా ఐదు మావోయిస్టులు మృతి చెందారు.

ఇంకా మావోయిస్టుల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది. కోర్చి పీయస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. కోర్చి పీయస్ పరిధి లో మావోయిస్టులు ఉన్నట్లు పక్క సమాచారం రావడంతో గడ్చిరోలి జిల్లా పోలీసులు… వారిపై దాడులు చేశారు. ఈ నేపథ్యంలోనే…. పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే.. దుర దృష్ట్యావశాత్తు… 5 గురు మావో యిస్టులు అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసుల కు మాత్రం ఎలాంటి ప్రమాదం జరుగలేదు.

Read more RELATED
Recommended to you

Latest news