ఒకే ఇంట్లో 8 మృతదేహాలు.. అసలేం జరిగింది..?

-

అమెరికాలోని ఒక్లహామా రాష్ట్రం బ్రోకెన్‌ యారో పట్టణంలో ఘోరం జరిగింది. మంటల్లో తగలబడిపోతున్న ఓ ఇంట్లో ఆరుగురు చిన్నారులు సహా 8 మంది అనుమానాస్పద స్థితిలో విగత జీవులుగా కనిపించారు. గురువారం రోజు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఉన్న ఇద్దరు పెద్దలు మొదట పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నారా? లేదా వీరందరినీ ఇంకెవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఇంటికి నిప్పు పెట్టారా అన్న విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు బ్రోకెన్‌ యారో పోలీస్‌ చీఫ్‌ బ్రాండన్‌ బెర్రీహిల్‌ తెలిపారు.

చిన్నారులంతా 1 నుంచి 13 ఏళ్లలోపువారని బ్రాండన్‌ బెర్రీహిల్‌ చెప్పారు. ఆ ఇంట్లో నుంచి తుపాకీలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే మృతుల వివరాలను వెల్లడించలేదు. వీరు అగ్నిప్రమాదం కారణంగా మరణించినట్లు కనిపించడం లేదని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. తాను కారులో వెళ్తుండగా ఆ ఇంటి నుంచి దట్టమైన పొగలు వస్తున్న విషయం గుర్తించానని, ఆ సమయంలో ఇంటి ముందు ఓ వ్యక్తి స్పృహలో లేని ఒక మహిళను ఈడ్చుకెళ్తూ కనిపించాడని కటెలిన్‌ పవర్స్‌ అనే స్థానిక మహిళ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news