ఆటోపై తెగిపడిన విద్యుత్ తీగలు.. 8 మంది మృతి

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరెంటు తీగలు తెగిపడి ఏకంగా ఎనిమిది మంది మృతి చెందారు. ఈ సంఘటన ఏపీ శ్రీ సత్య సాయి జిల్లాలో… చోటు చేసుకుంది. శ్రీ సత్య సాయి జిల్లా లో ఆటో పై విద్యుత్ తీగలు పడడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. వ్యవసాయ పనులకు ఆటోలో వెళుతుండగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం అందుతుంది.

శ్రీ సత్య సాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండాయపల్లి వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. గుండ్రంపల్లి నుంచి చిల్లకొండాయపల్లి కి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోలో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. ఇక ఈ ఘటన తెలిసిన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక ఈ ఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news