తొలి మ్యాచ్ కి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ కు గట్టి దెబ్బ..!

-

క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ నిన్న ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి పోరు తో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక రెండవ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య పోరు జరిగేందుకు అంతా సిద్ధం అయ్యింది. ఇక ఈ మ్యాచ్ ను తిలకించేందుకు అటు క్రికెట్ ప్రేక్షకులందరూ వేచి చూస్తున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తొలి మ్యాచ్ కి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కి భారీ షాక్ తగిలింది.

ప్రస్తుతం జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ బౌలింగ్ చేస్తూ గాయ గాయపడ్డాడు. ఇది ఢిల్లీ క్యాపిటల్స్ కి గట్టి దెబ్బే అని చెప్పాలి. అయితే అతను కోలుకునేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉన్నందున నేడు పంజాబ్ తో జరగబోయే మ్యాచ్లో ఇషాంత్ శర్మ అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువే అని అంటున్నారు విశ్లేషకులు. కాగా ఇషాంత్ శర్మను గత కొన్ని రోజుల నుంచి గాయాలు వేధిస్తూ కెరియర్ ను దెబ్బ తీస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news