స్కూల్ లో భారీ పేలుడు, 9 మంది విద్యార్ధులు మృతి…!

-

పాకిస్తాన్ లో ఒక మదర్సా వద్ద జరిగిన పెద్ద పేలుడు ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పెషావర్ లోని ఒక కాలనీ మొత్తం షేక్ అయిపోయింది. పెషావర్‌ లోని దిర్ కాలనీలోని మదర్సాలో ఈ పేలుడు జరిగింది. ఏడుగురు మరణించగా, మరో 70 మంది గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. “మదర్సాలో పేలుడు జరిగింది, అక్కడ తెలియని వ్యక్తులు ప్లాస్టిక్ సంచిలో పేలుడు పదార్థాలను ఉంచారు ” అని ఒక పోలీసు అధికారి మంగళవారం వెల్లడించారు.

70 మంది గాయపడగా వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించామని చెప్పారు. పేలుడులో చాలా మంది కాలిన గాయాలతో బాధపడుతున్నారు అని వివరించారు. మృతుల్లో నలుగురు పిల్లలు అని ఆసుపత్రి డైరెక్టర్ తారిక్ బుర్కి తెలిపారు. మదర్సా ఎక్కువగా వయోజన విద్యార్థుల కోసం సేవలు అందిస్తుంది అని… పేలుడు జరిగినప్పుడు చాలా మంది ఉన్నారు అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news