హోటల్​కు పిలిచి మహిళపై వ్యాపారి అత్యాచారం

-

బిజినెస్ కు సంబంధించిన విషయం చర్చిద్దామంటూ హోటల్ కి పిలిచి ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక వ్యాపారవేత్త. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రమేశ్​ తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్తకు బాధితురాలితో చిన్ననాటి నుంచే పరిచయం ఉంది. బాధితురాలు వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనలో ఉంది. ఈ క్రమంలోనే వ్యాపార విషయమై చర్చిద్దామంటూ ఆగస్టు 6న నగరంలోని ఓ ఫైవ్​ స్టార్ హోటల్​ కు పిలిచాడు. బాధితురాలు నమ్మి వెళ్లగా.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట పెడితే చంపేస్తానంటూ బెదిరించాడు.

అనంతరం నిందితుడు రమేశ్​.. తమిళనాడుకు పారిపోయాడు. ఆ తర్వాత ఆగస్టు 10న కబ్బన్​ పార్క్​ పోలీస్​ స్టేషన్​లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీలైనం త్వరగా నిందితుడిని పట్టుకుని కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు. మహిళలు, అమ్మాయిలు ఇలా ఒంటరిగా వెళ్లాల్సిన పరిస్థితులు వస్తే తోడుగా ఎవరినైనా తీసుకెళ్లాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news