విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్ పై కేసు నమోదు

-

గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర: అని విద్యా బుద్ధులు నేర్పే గురువుకు ఆ భగవంతునితో సమానంగా సమాజంలో స్థానం కల్పించారు. కానీ అంతటి ఉన్నత స్థానంలో ఉన్న ఉపాధ్యాయులు కొందరు ఆ వృత్తికే కళంకం తెచ్చే విధంగా దారి తప్పుతున్నారు.హయత్ నగర్ లో గౌతమి జూనియర్ కాలేజ్ చైర్మన్ అండ్ ప్రిన్సిపల్ సత్యనారాయణ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది.

అదే కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థినిని మాయ మాటలు చెప్పి సినిమా కి తీసుకుని వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు ప్రిన్సిపల్ సత్యనారాయణ.ఈ నెల 16 న కూడా నీకు ప్రత్యేక క్లాస్ చెపుతాను కాలేజ్ కి రమ్మని విద్యార్థినికి ఫోన్ చేశాడు ప్రిన్సిపల్ సత్యనారాయణ. దీంతో విద్యార్థిని జరిగిన సంఘటనలను కుటుంబ సభ్యులకి తెలియజేసింది. దీంతో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ప్రిన్సిపల్ సత్యనారాయణ పరారీలో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news