బ్రేకింగ్: నేడే జగన్ బెయిల్ రద్దు వాదనలు…!

-

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజుకి సంబంధించి ఇప్పుడు కాస్త కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఆయన సిబిఐ కోర్ట్ లో దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటీషన్ నేడు విచారణ జరగనుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ కృష్ణ రాజు పిటిషన్ పై సీబీఐ కోర్టు నేడు విచారణ చేపడుతుండగా పిటీషన్ పై కౌంటర్ దాఖలుకు ఇప్పటికే రెండు సార్లు జగన్, సీబీఐ కోరారు.

jagan

కౌంటర్ దాఖలు చేసేందుకు జగన్, సీబీఐకి చివరి అవకాశం ఇస్తున్నామంటూ ఈ నెల 17 తేదీన సీబీఐ కోర్ట్ హెచ్చరించింది. నేడు జగన్ , సీబీఐ కౌంటర్ దాఖలు చేస్తాయి. కౌంటర్ పై నేడు సీబీఐ కోర్ట్ లో వాదనలు వినిపిస్తారు. ఇరు వాదనలు విన్న తరువాత కీలక ఆదేశాలను సిబిఐ కోర్ట్ జారీ చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news