కరీంనగర్ లో దారుణం..ఆస్తికోసం సొంత బావమరిదినే బావ హత్య..!

-

కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బావమరిది అస్తిపై కన్నేసి సఫారీ హత్య చేయించాడు ఓ బావ. గత 2వ తేదీన కరీంనగర్ జిల్లా మానకొండూర్ లో జరిగిన ఘటన పై గోదావరిఖని వ్యక్తులపై పోలీసుల నిఘా పెట్టారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. తిమ్మాపూర్ కు చెందిన కొమ్ము రవి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

తన కొడుకు మృతిపై అనుమానం ఉందంటూ పోలీసులకు పిర్యాదు చేశాడు తండ్రి. అయితే.. బావే హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరణ చేసినట్లు గుర్తించారు. గోదావరి ఖని కార్పొరేటర్ భర్తనే సూత్రదారిగా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. హత్య చేసింది గోదావరిఖని ప్రాంత వాసులని నిర్ధారించిన పోలీసులు.. హత్య కోసం 3 లక్షల సూపారి తీసుకున్నట్లు గుర్తించారు.

కోటి రూపాయల విలువచేసే భూ వివాదమే హత్యకు కారణంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లి కాకతీయ కాలువ వద్ద 2 వ తేదీన ఘటన జరిగింది. స్వంత బావమరిదినే ఆస్తి కోసం హత్య చేయించి ప్రమాదంగా చిత్రీకరణ చేసినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యుల అనుమానంతో పూడ్చిన శవాన్ని ఓపెన్ చేసి పోస్టుమార్టం చేయించారు పోలీసులు. ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news