భర్త ఉద్యోగం తనకు కావాలని..కట్టుకున్న వాన్నే చంపేసిన భార్య !

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి గాంధీ కాలనీకి చెందిన కుమ్మర బోయిన శ్రీనివాస్ కొత్తగూడెం కలెక్టర్ రేట్ లో అటెండర్ గా పనిచేస్తున్నారు. గత నెల 29న అర్ధరాత్రి ఆయన వంటింట్లో జారిపడ్డాడని, తలకు తీవ్ర గాయం అయిందని భార్య సీతా మహాలక్ష్మి మర్నాడు ఉదయం కొత్తగూడెంలోని జిల్లా ఆసుపత్రిలో చేర్పించింది.

కొద్ది గంటల చికిత్స అనంతరం ఆయన మృతి చెందాడు. తండ్రి మృతి పై అనుమానం ఉన్నట్లు కుమారుడు సాయి కుమార్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. భర్తను ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత కనిపించకుండా పోయిన సీతామహాలక్ష్మి పై నిగా పెట్టారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ వెళ్లేందుకు ఆమె కొత్తగూడెం రైల్వే స్టేషన్ కు రాగా అదుపులోకి తీసుకుని విచారించారు. “ఆరోజు నా భర్త తాగిన మైకంలో ఇంటికి వచ్చారు. నిద్రలోకి జారుకున్నాక కర్రతో తలపై కొట్టా. వంట గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్ట”. అని నిందితురాలు అంగీకరించినట్లు ఎస్సై తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news