హైదరాబాద్‌లో మ‌రో దారుణం.. అత్త‌పై అల్లుడు అత్యాచారం..

-

దిశ ఘటన తర్వాత ఏపీ ప్రభుత్వం కొత్తగా దిశ చట్టం తీసుకొచ్చింది. అత్యాచారం చేస్తే మరణశిక్షే అని చెప్పింది. అయినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. దిశ ఘటన ఇంకా మ‌ర‌వ‌క ముందే హైద‌రాబాద్‌లో మ‌రో దార‌ణం చోటుచేసుకుంది. అత్తపై అల్లుడు అత్యాచారం చేశాడు. మత్తు మందు ఇచ్చి.. ఆమె నిద్రలో ఉన్న సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పంజాగుట్టలో ఈ ఘోరం జరిగింది. మత్తు నుంచి తేరుకున్న బాధితురాలు జరిగిన దారుణాన్ని గ్రహించి వెంటనే పోలీసులను ఆశ్రయించింది.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో అల్లుడిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వావి వరసలు మరిచి కామాంధులు సాగిస్తున్న కీచక పర్వం ఆందోళనకు గురి చేస్తోంది. మానవ సంబంధాలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి ఈ ఘటనలు. ఎన్‌కౌంటర్లు జరిగినా, చట్టాలను కఠినతరం చేసినా.. ఈ దారుణాలు ఆగకపోవడం మహిళలు బ‌య‌ట‌కు రావ‌డానికే భ‌య‌ప‌డుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news