బ్రేకింగ్: ఆ 22 లక్షలు రియా చక్రవర్తి ఎందుకు తీసుకుంది…?

-

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం విషయంలో విచారణ కొనసాగుతుంది. ఈ విచారణ విషయంలో ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా సీరియస్ గానే ఉంది. దర్యాప్తు సంస్థలు కూడా వేగం పెంచాయి. తాజాగా ఒక కీలక విషయం ఈడీ సంస్థలు గుర్తించాయి. సుశాంత్ సింగ్ రాజ పుత్ 62 లక్షలు క్వాన్ అనే ఒక టాలెంట్ ఏజెన్సీకి చెల్లించాడు. ఆ సొమ్ము ఎందుకు చెల్లించాడు అనే దానిపై ఈడీ ఆరా తీస్తుంది.

అందులో 22 లక్షలు అతని ప్రేయసి రియా చక్రవర్తి కి ఏజెన్సీ చెల్లించింది. ఎందుకు చెల్లించాల్సి వచ్చింది, అక్రమ లావాదేవీ నా లేక మనీ లాండరింగా అనే దానిపై ఆరా తీస్తుంది ఈడీ. 62 లక్షలకు ఆమె మధ్యవర్తిగా వ్యవహరించిందా అనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే 15 కోట్లకు సంబంధించి ఆధారాలు ఈడీ సేకరించింది.

Read more RELATED
Recommended to you

Latest news