లీటర్‌ పెట్రోల్‌ రూ. 254.. ఎక్కడో తెలుసా..?

-

సాధారణంగా ఎక్కడ ఏం జరిగినా..దాని ఎఫెక్ట్ పెట్రోల్, వంటనూనె, బంగారం మీదే పడుతుంది. అయితే అమాంతం పెరుగుతుంది.. లేదా తగ్గిపోతాయి. చాలావరకూ ధరలు పెరగడమే జరుగుతుంది. అలాగే ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం కారణంగా ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రెండు దేశాల మధ్య జరిగే యుద్ధం పలు ధరలపై ఎఫెక్ట్‌ పడుతోంది. ఆంధ్రాలోనే నూనె ధరలో కొందరూ ఇదే అదనుగా చూసుకుని కొండెంక్కించారు. వారిపై అధికారులు చర్యలు తీసుకున్నారునుకోండి.

ఈ యుద్ధం ప్రభావం చమురు ధరలపై విపరీతంగా చూపిస్తోంది. యుద్ధం కారణంగా పలు దేశాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇక తాజాగా శ్రీలంకలో అయితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతున్నట్లు ఎల్‌ఐవోసీ (LIOC) ప్రకటించింది. ఈ మేరకు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.50, లీటర్‌ డీజిల్‌పై రూ.75 పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరను పెంచిన అనంతరం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.254కి చేరుకోగా, లీటర్‌ డీజిల్ ధర రూ.214కు చేరుకుంది. ఈ విషయంతో అక్కడి వాహదారుల గుండెలు గుబేలుమన్నాయి.

ఎల్‌ఐవోసీ ఏం అంటుంది..?

మరో వైపు శ్రీలంక రూపాయి భారీగా పతనమైంది. ఈ నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని ఎల్‌ఐవోసీ తెలిపింది. ప్రస్తుతం శ్రీలంక రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రూ.57కి తగ్గింది. శ్రీలంక రూపాయి పడిపోవడం గత వారం రోజుల్లో ఇది రెండో సారి. నెల రోజుల వ్యవధిలోనే శ్రీలంకలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం ఇది మూడోసారి. అయితే ఈ ధరల పెంపుపై శ్రీలంక ప్రభుత్వం ఎలాంటి రాయితీ ఇవ్వలేదని, దీంతో అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల కారణంగా కంపెనీ తీవ్రంగా నష్టపోవాల్సిన స్థితి ఏర్పడిందని, అందుకే పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాల్సి వచ్చిందని ఎల్‌ఐవోసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనోజ్‌ గుప్తా వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news