నేను సీఎం జగన్‌ పీఏను.. రూ.10 లక్షలు పంపండి..

-

కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా సీఎం జగన్‌ పీఏనంటు ఓ కేటుగాడు కార్పొరేట్‌ ఆసుపత్రికి టొకరా వేయబోయాడు. కానీ.. ఆసుపత్రి యాజమాన్యం అప్రమత్తంతో కేటుగాడి బురిడి నుంచి బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మణిపాల్ ఆసుపత్రి ఎండీకి ఇటీవల ఓ మెసేజ్ వచ్చింది. పంపిన వ్యక్తి తాను సీఎం పీఏ నాగేశ్వరరెడ్డినని పరిచయం చేసుకుంటూ.. రాష్ట్రానికి చెందిన రికీబుయ్ అనే యువకుడు ఇంటర్నేషనల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు ఎంపికయ్యాడని పేర్కొన్నాడు. అందులో ఆడాలంటే అతడికి ఇంటర్నేషల్ క్రికెట్ కిట్ అవసరమని, అందుకు రూ. 10,40,440 అవసరం అవుతుందని, ఆ మొత్తాన్ని పంపాలని కోరాడు.

Contact Us - JCECONOMICS.COM

బెంగళూరులో ఉన్న ఆసుపత్రి ఎండీ ఆ మెసేజ్‌ను తాడేపల్లి మణిపాల్ వైద్యశాల అసోసియేట్ డైరెక్టర్ జక్కిరెడ్డి రామాంజనేయరెడ్డికి ఫార్వార్డ్ చేసి పరిశీలించాలని కోరారు. అది చూసిన ఆయన అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వ్యక్తిపై ఇప్పటికే ఇలాంటివి ఆరు కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా, ఇటీవల నెల్లూరులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. తాను ఓ మంత్రి పీఏనంటూ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న విచారిస్తున్నారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Latest news