వైశాలి కిడ్నాప్ కేసు రిమాండ్ రిపోర్టులో వెలుగులోకి కొత్త ట్విస్ట్

-

వైశాలి కిడ్నాప్ కేసులో పోలీసులు కీలక విషయాలను రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 32 మందిని అరెస్టు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో వివరించారు పోలీసులు. నవీన్ రెడ్డి తో పాటు మరో ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

గత ఏడాది బొంగులూరు లోని స్పోర్ట్స్ అకాడమీ లో వైశాలీతో నవీన్ రెడ్డికి పరిచయం ఏర్పడిందని.. ఆ సమయంలోనే వైశాలి నెంబర్ తీసుకొని ఆమెకు తరచూ ఫోన్లు, మెసేజ్లు చేసేవాడని పోలీసులు ఈ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అలా కొన్ని రోజుల తర్వాత నవీన్ రెడ్డి వైశాలి వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. తన తల్లిదండ్రులను అడగాలని వైశాలి నవీన్ రెడ్డికి చెప్పిందని, వైశాలి పేరెంట్స్ ను ఒప్పించేందుకు నవీన్ రెడ్డి ప్రయత్నించారు.

కానీ నవీన్ రెడ్డికి వైశాలిని ఇచ్చేందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో వైశాలి కుటుంబం పై నవీన్ రెడ్డి కక్షపెంచుకున్నారని రిమైండర్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇక ఐదు నెలల క్రితం ఆమె ఇంటి ముందు స్థలాన్ని లీజ్ కి తీసుకొని అలజడి సృష్టించాడని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. వారం ముందు నుంచే వైశాలి కిడ్నాప్ కు నవీన్ రెడ్డి ప్లాన్ చేశారని.. వైశాలి సహా చుట్టుపక్కల వారిని భయభ్రాంతులకు గురి చేసేలా ప్లాన్ చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news