సీఎం యోగిని మూడు రోజుల్లో చంపేస్తామంటూ బెదిరింపు మెసేజ్

-

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ వచ్చిన మెసేజ్ లు కలకలం రేపుతున్నాయి. ఆగస్టు 2 న లక్నో కంట్రోల్ రూమ్ లోని వాట్సప్ హెల్ప్ లైన్ నెంబర్ కు ఓ బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో సీఎం యోగిని మూడు రోజుల్లోగా హతమారుస్తామని పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన యూపీ పోలీసులు ఈ బెదిరింపు మెసేజ్ పై దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయంపై సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు లక్నో పోలీసులు తెలిపారు.

అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని ఓ వ్యక్తి యూపీ సీఎం ను మూడు రోజుల్లో చంపేస్తామంటూ, బాంబు దాడులు చేస్తామంటూ లక్నో పోలీస్ కంట్రోల్ రూమ్ లోకి హెల్ప్ లైన్ వాట్సాప్ నెంబర్ కు ఆగస్టు 2వ తేదీన మెసేజ్ పంపించారు. ఆ మెసేజ్ వచ్చిన వెంటనే పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నిందితులను అరెస్టు చేసేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని లక్నో పోలీసులు తెలిపారు.

అయితే కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ.. ఇటువంటి బెదిరింపు మెసేజ్ రావడంతో యూపీ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. గతంలో కూడా యోగి ఆదిత్యనాథ్ కు అనేక హత్య బెదిరింపులు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news