ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంలో ఊరట !

-

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఎఎం ఖన్‌విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిల ధర్మాసనంలో ఈ విచారణ జరిగింది. ఏడాది నుంచి సస్పెన్షన్ పొడిగింపుపై సర్వీస్ నిబంధనలు చూపించాలి అని ప్రభుత్వాన్ని కోర్టు కోరింది. అయితే అఖిల భారత సర్వీసు నిబంధనలలో ఉన్న రూల్ 3లో 1-సీ కింద సస్పెన్షన్ పొడిగించామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. రివ్యూ కమిటీ నిర్ణయం ప్రకారం ఆరు నెలల తర్వాత సస్పెన్షన్ పొడిగించినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. 

ఏబీ వెంకటేశ్వరరావుపై అవినీతి ఛార్జ్ లేదని రూల్ 3లోని 1-బీ ప్రకారం ఏడాది కంటే ఎక్కువ సస్పెన్షన్ ఉండటానికి వీల్లేదని ఏబీ వెంకటేశ్వరరావు తరపు న్యాయవాది ఆదినారాయణరావు వాదించారు. మరి అలాంటప్పుడు సస్పెన్షన్ పొడిగించిన రివ్యూ కమిటీ ఆదేశాలను ఎందుకు సవాలు చేయలేదు అని ఏబీ వెంకటేశ్వరరావు తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సస్పెన్షన్ పొడిగిస్తూ రివ్యూ కమిటీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేసేందుకు మూడు రోజుల గడువు కోరగా కోర్టు అందుకు అనుమతినిచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావు వేసే అప్లికేషన్ పై ఆ తర్వాత మూడు రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించి, తదుపరి విచారణ మార్చి 9కి వాయిదా వేసింది. 

Read more RELATED
Recommended to you

Latest news