AP FIBERNET: చంద్రబాబు పై మరో కేసు వేసిన సిఐడి … !

-

చంద్రబాబు నాయుడు ప్రస్తుతం స్కిల్ స్కాం కేసులో రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో నిధులను దుర్వినియోగం చేశారన్న అభియోగంతో రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్నాడు. ఇక రిమాండ్ రిపోర్ట్ మరియు ఎఫ్ ఐ ఆర్ లపై చంద్రబాబు తరపున లాయర్ లు సవాలు చేస్తూ క్వాష్ పిటిషన్ ను హై కోర్ట్ లో వేశారు.. దానికి సంబంధించిన విచారణ కాసేపటి క్రితమే పూర్తి అయింది. కానీ ఈ పిటిషన్ పై తీర్పును మాత్రం న్యాయస్థానం రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం మరో కేసును చంద్రబాబు పై సిఐడి వేసింది. గతంలో ఫైబర్ నెట్ లో అవకతవకలు జరిగాయని తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసును ఏసీబీ కోర్ట్ లో పిటిషన్ వేయగా, ఈ కేసును విచారించడానికి ఏసీబీ కోర్ట్ అంగీకరించింది. కాగా ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడుని ప్రధాన ముద్దాయిగా పేర్కొనడం విశేషం. త్వరలోనే దీనికి సంబంధించి కోర్ట్ లో చంద్రబాబు తరపున లాయర్ విధించాల్సి ఉంటుంది.

చంద్రబాబుకు టైం అస్సలు బాగాలేనట్లు ఉంది.. దెబ్బ మీద దెబ్బ అన్నట్లు… కేసుల మీద కేసులతో ఊపిరి ఆడకుండా చేస్తున్నారు సిఐడి వాళ్ళు.

Read more RELATED
Recommended to you

Latest news