సవాల్ కు కట్టుబడి ముద్రగడ పేరు మార్చుకున్నారు : మంత్రి అంబటి రాంబాబు

-

కిర్లంపూడి లో ముద్రగడను మాజీ మంత్రి అంబటి కలిశారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.ముద్రగడ పేరు మార్చుకున్నారని తెలిసి అభినందించడానికి కిర్లంపూడి వచ్చాను అని అన్నారు.

 

సవాల్ కు కట్టుబడి ముద్రగడ పేరు మార్చుకున్నారు.చాలామంది సవాళ్లు చేస్తారు.. నాకు తెలిసి ఎవరు కట్టుబడి ఉండలేదు.పేరు మారినా ముద్రగడ ముద్రగడే అని అన్నారు.రాజకీయాల్లో నష్టపోయిన ముద్రగడ.. తన కులాన్ని ఏనాడు ఉపయోగించుకోలేదని ఆయన అన్నారు. కాపునాడు సమావేశం సమయంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఆ సమావేశానికి ముద్రగడ వచ్చారని అన్నారు. ఆ సమయంలో వంగవీటి జైలులో ఉన్నారని, కేవలం ఒక సవాల్ను స్వీకరించి ముద్రగడ తన పేరును మార్చుకున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news