ఆచార్య మూవీకి జగన్ సర్కార్ గుడ్ న్యూస్…. టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి

-

మెగా అభిమానులకు పండగ రాబోతోంది. ఈనెల 29న ‘ ఆచార్య’ మూవీ రిలీజ్ కాబోతోంది. దాాదాపు రెండేళ్ల గ్యాప్ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీగా అంచనాలు పెరిగాయి. మరోవైపు రామ్ చరణ్ కూడా  కీలక పాత్రలో కనిపిస్తుండటం కూడా ఫ్యాన్స్ లో మరింత  ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. ఇక  టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండటం… ఇప్పటి వరకు కొరటాల డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ మాసీవ్ హిట్లుగా నిలవడంతో ఆచార్య కూడా తప్పకుండా హిట్ సాధిస్తుందని మెగా అభిమానులు సంబరపడిపోతున్నారు. 

ఇదిలా ఉంటే ‘ ఆచార్య’ మూవీ కోసం ఇప్పటికే తెలంగాణ సర్కార్ ఐదో షోతో పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. తాజాగా ఏపీలోని జగన్ సర్కార్ కూడా ‘ ఆచార్య’ మూవీకి గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా వ్యయం రూ. 100 కోట్లు దాటడంతో టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఏప్రిల్ 29 నుంచి పది రోజుల పాటు కొత్త ధరలు అమలులో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఐదో షో వేసుకునే దానిపై ప్రభుత్వం ఇచ్చిన జీవోలో స్పష్టత ఇవ్వలేదు.

Read more RELATED
Recommended to you

Latest news