ఏపీ బడ్జెట్ పై అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

-

ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. బడ్జెట్ లో వాస్తవాలు లేవని మండిపడ్డారు. వైసీపీ ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ మోసపూరితమేనని అని విమర్శించారు. బడ్జెట్ లో వాస్తవాలు లేవని.. అడిగితే తెలుగుదేశం సభ్యులని సస్పెండ్ చేశారని మండిపడ్డారు. శస్త్ర చికిత్స విజయవంతం.. రోగి మృతి అన్నట్లుగా బడ్జెట్ ను రూపొందించారని ఎద్దేవా చేశారు.

గత బడ్జెట్ నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు. ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు సిగ్గు లేకుండా అసత్యాలు చెప్పారని ధ్వజమెత్తారు. కమిషన్ల కోసమే సాగునీటి రంగానికి 22 వేల కోట్ల కేటాయింపులు చూపారని ఆరోపించారు. సీఎం జగన్ ప్రారంభించిన రెండు ప్రాజెక్టులు టిడిపి ప్రభుత్వ హయాంలోనే 90% పనులు పూర్తి చేసుకున్నవేనని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news