వచ్చే ఎన్నికల్లో 160 సీట్లు గెలుస్తాం: అచ్చెన్నాయుడు

-

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనపై ప్రజలు విసిగిపోయారని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగన్ పాలనపై టీడీపీ నేతలు మండిపడ్డారు. జగన్ మూడేళ్ల పాలనపై చార్జ్ షీట్ విడుదల చేశారు. వైకాపా పాలనలో రాష్ట్ర అభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు.

అచ్చెన్నాయుడు
అచ్చెన్నాయుడు

ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్‌ను చంపిన అంశాన్ని డైవర్ట్ చేయడానికి అల్లర్లు సృష్టించాడని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో కుల ఘర్షణలు ఎక్కువయ్యాయని, సొంత బాబాయ్ హత్య కేసులో బాంబులేస్తామని సీబీఐ అధికారులనే బెదిరిస్తున్నాడని ఆయన ఆరోపించారు. టీడీపీ హయాంలో 57 శాతం సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. కానీ వైకాపా 47 శాతం ఖర్చు పెట్టి.. సంక్షేమ రాజ్యం అని చెప్పుకుంటుందన్నారు.

వైకాపా పాలనలో ప్రజలు విసిగిపోయారని అనడానికి మహానాడు విజయవంతం కావడమే సంకేతమన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి 160 గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో పొత్తుల గురించి ఆలోచిస్తామని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news