హీరోయిన్ పూర్ణను బ్లాక్ మెయిల్ చేసిన ముఠా అరెస్ట్..!

-

సీమ టపాకాయ్, అవును చిత్రాలలో నటించిన హీరోయిన్ పూర్ణను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేసిన నలుగురు సభ్యుల ముఠాను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. అష్రఫ్, రఫీఖ్, శరత్, రమేశ్ అనే నలుగురూ యువకులు తరచూ ఆమెకు ఫోన్లు చేసి వేధించడం, డబ్బు ఇవ్వాలంటూ పూర్ణను బెదిరిస్తూ బ్లాక్ ‌మెయిలింగ్‌ కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితులు నలుగురికీ జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

అయితే గతంలో కూడా వీరు ఇతర ప్రముఖులను ఇలాగే బ్లాక్ మెయిల్ చేశారని పోలీసులు గుర్తించారు. అయితే ఈమధ్య సినిమాలు ఏమీ లేకపోవడం, లాక్‌ డౌన్‌ విధించడంతో కేరళలోని సొంతవూరు కోచిలో ఉంటోంది. అంతేకాదు, ప్రస్తుతం తన సొంత భాష అయిన మలయాళం సినీ ఇండస్ట్రీపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు మలయాళం సినిమాలకు పూర్ణ ఓకే చెప్పినట్టు సమాచారం. పైగా  ఆమెకు పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట.

Read more RELATED
Recommended to you

Latest news