అలా చేస్తే.. తెలంగాణ భవన్‌ పేల్చేస్తాం.. అద్దంకి దయాకర్ సంచలనం

-

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిల వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఇద్దరి నేతల కామెంట్స్ ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపాయి. ‘‘పొట్టొడు.. పిసికితే ప్రాణం పోతుంది’’ అని రేవంత్ రెడ్డిని మంత్రి తలసాని విమర్శించగా.. ’’గుట్కాలు తినేవాడు.. పెండ పిసికేవాడు.. దున్నపోతు’’ అని మంత్రి తలసానికి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పరం విమర్శలు కురిపించుకుంటున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్‌పై తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ స్పందించారు.

Addanki Dayakar: లిక్కర్ డబ్బుతోనే కాంగ్రెస్‌ను దెబ్బ తీశారు | Telangana Congress leader Addanki Dayakar comments msr spl

అద్దంకి దయాకర్ రావు బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.తలసాని ఉద్యమ ద్రోహి అని మండిపడ్డారు. కులం అడ్డుపెట్టుకుని గొడవలు పెట్టాలనుకుంటున్నారు అని అన్నారు.బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే యాదవులకు సీఎం పదవి ఇవ్వాలి అని అద్దంకి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కి గాంధీభవన్ దగ్గరికి వచ్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. వస్తే తెలంగాణ భవన్ ను పేల్చేస్తాం అని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ హెచ్చరించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news