జ‌న‌సేన‌కు షాక్‌: వైసీపీలోకి జంప్ చేసిన మ‌రో సీనియ‌ర్ నేత‌..

-

జనసేన పార్టీకి నేతలు వరుసగా ఝలక్ ఇస్తున్నారు. ఈ నెలలోనే దాదాపు ఐదారుగురు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. కొందరు బీజేపీగూటికి చేరగా.. మరికొందరు వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. ఇక తాజ‌గా జనసేన మాజీ అధికార ప్రతినిధి, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అద్దేపల్లి శ్రీధర్ వైసీపీలో చేరారు. ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. జగన్ సమక్షంలోనే ఆయన పార్టీలో చేరాల్సి ఉన్నా అనివార్య కారణాలతో కుదరలేదని తెలుస్తోంది.

కాగా శ్రీధర్ మొదటగా బీజేపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.. ఆ తరువాత జనసేనలో చేరారు. ఆ పార్టీలో కొంతకాలం కీలకంగా వ్యవహరించారు. అయితే ఎన్నికల ముందు పవన్ తో విభేదించిన ఆయన కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ నేపధ్యలో బుధవారం వైసీపీలో చేరారు.

Read more RELATED
Recommended to you

Latest news