మళ్లీ విలన్‌గా యువహీరో..‘యూటర్న్’ నిర్మాతలతో సినిమా

-

రామ్ క‌థానాయ‌కుడిగా లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో #RAPO19 తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ‘ఉప్పెన‌’ ఫేమ్ కృతి శెట్టి నాయిక‌. తెలుగు-త‌మిళ్ ద్విభాషా చిత్ర‌మిది. జాతీయ అవార్డ్ గ్ర‌హీత లింగుస్వామి ఈ సినిమాతో రామ్‌లో మ‌రో కొత్త కోణాన్ని తెర‌పై ఆవిష్క‌రించ‌నున్నారు. తాజాగా ఆది పినిశెట్టిని విల‌న్‌గాఎంపిక చేశారు. ‘ స‌రైనోడు’ త‌ర్వాత రెండోసారి పూర్తి స్థాయి విల‌న్ పాత్ర‌లో అవ‌కాశం ద‌క్కినందుకు ఆది పినిశెట్టి సంతోషం వ్య‌క్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆది పినిశెట్టి మాట్లాడుతూ ‘‘ద‌ర్శ‌కుడు వినిపించిన క‌థ విన్నా. స్క్రిప్టు చ‌దివాక వారం తీసుకున్నా.. ‘స‌రైనోడు’ త‌ర్వాత మ‌ళ్లీ విల‌న్‌గా చేయాలంటే పాత్ర‌లో ఏదైనా ప్ర‌త్యేక‌త ఉండాల‌ని అనుకున్నా. ఇది విన్నాక నార్మల్‌గా ఉండే రోల్ కాదనిపించింది. మామూలుగా సినిమాల్లో విల‌న్ పాత్ర‌కు డీటెయిలింగ్ ఉండ‌దు. ఇందులో అది ఉంది. ఈ రోల్ క‌డ‌ప క‌ర్నూల్‌కి చెందిన రా అండ్ ర‌స్టిక్ రోల్.. త‌మిళంలో మ‌ధురై బేస్‌లో ఉంటుంది. ‘స‌రైనోడు’లో స్టైలిష్ విల‌న్‌గా చేశాక‌.. ఇందులో మ‌ళ్లీ విల‌న్ పాత్ర ఇంట‌రెస్టింగ్‌గా అనిపించింది. ప్యార‌ల‌ల్‌గా నా సినిమాలు నేను చేస్తూ డిఫ‌రెంట్ షేడ్‌ని ఇందులో చూపించ‌వ‌చ్చు.

`యూట‌ర్న్` నిర్మాత‌ల‌తో నాకు ఇది రెండో సినిమా. రామ్ చేసిన సినిమాలన్నీ చూశా. తను చాలా ఎనర్జిటిక్‌గా చేస్తుంటారు. ఇద్దరం కలిసి ఈ సినిమాలో చేయబోతున్నందుకు హ్యాపీగా ఉంది. ఇక లింగుస్వామి బ‌ల‌మైన విల‌న్ పాత్ర‌ను చాలా స్ట్రాంగ్‌గా చూపించ‌నున్నారు. ఇలాంటి కార‌ణాల వ‌ల్ల ఈ సినిమాలో చేస్తున్నాను. ఇలాంటి అరుదైన అవ‌కాశాలు న‌టుడిగా న‌న్ను నేను విస్త‌రించ‌డానికి అవ‌కాశం అనుకుంటున్నాను. షూటింగ్ కోసం వేచి చూస్తున్నా.’’ అని అన్నారు

Read more RELATED
Recommended to you

Latest news