బ్రేకింగ్:హైకోర్టులో అగ్రిగోల్డ్‌ కేసు విచారణ..వీరికి మాత్రమే చెల్లింపులు…!

-

తెలంగాణ హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసుకి సంభందించి కీలక విచారణ జరిగింది. రూ.20వేల లోపు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది.వార్డు సచివాలయం ద్వారా డిపాజిట్‌దారుల వివరాలని సేకరిస్తామని ఏపీ ప్రభుత్వం కోర్టుకి తెలిపింది.ఇక సేకరించిన డిపాజిట్ దారుల వివరాలు సీఐడీ డీఎస్పీ, ఆర్డీవో పరిశీలిస్తారని..వీటిని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, కలెక్టర్‌, సీఐడీ ఎస్పీ ధ్రువీకరిస్తారని తెలిపింది.


కలెక్టరేట్‌ ద్వారా అర్హులైన డిపాజిటర్ల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామని ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ తెలుపగా మార్చి31 నాటికి పంపిణీ ప్రక్రియ పూర్తిచేయాలని ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అగ్రిగోల్డ్‌ కేసును ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరుపుతుంది. కేసు బదిలీ చేసే పరిపాలన అధికారం తెలంగాణ హైకోర్టు సీజేకు ఉంటుందని ధర్మాసనం తెలిపింది. ఇక ఆస్తుల వేలంపై తమ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆంధ్రాబ్యాంకు, ఎస్‌బీఐ హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళాయి. బ్యాంకుల పిటిషన్లపై గురువారం విచారణ జరుపుతామని తెలంగాణ హైకోర్టు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news