కెసిఆర్ జాతీయ పార్టీ అనగానే బిజెపి, కాంగ్రెస్ పార్టీల్లో వణుకు పుట్టింది: బాల్క సుమన్

-

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ లపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ది కులపిచ్చి, బండి సంజయ్ ది మత పిచ్చి అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ అనగానే బిజెపి, కాంగ్రెస్ పార్టీల్లో వణుకు పుట్టింది అని చెప్పారు. కెసిఆర్ అంటే కాలం చెల్లిన మెడిసిన్ కాదని.. ప్రాణం పోసే సంజీవని అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని బాల్కసుమన్ ఎద్దేవా చేశారు.

సోనియా గాంధీకి ఈడీ నోటీసులు ఇచ్చిన ఆ పార్టీ పోరాడటం లేదని అన్నారు. కొన ఊపిరితో ఐసీయూలో ఉన్నట్టుగా కాంగ్రెస్ పరిస్థితి ఉందని చెప్పారు. బిజెపి ఉన్మాద పార్టీ అని మండిపడ్డారు. బీజేపీ దుర్మార్గాలను దేశ ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. బీజేపీది ఢిల్లీలో తుగ్లక్ పాలన, గల్లీలో తుగ్లక్ వాదన అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. బండి సంజయ్ కు చేతనైతే విభజన హామీ చట్టాలను అమలు చేసి చూపించాలని సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news