AK47 గన్లు పట్టుకుని ప్రగతి భవన్‌కు వెళ్లాలి: ఆకునూరి మురళి

-

తెలంగాణ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌలు రైతులు ఏకే 47 గన్ లు పట్టుకొని కేసీఆర్ నివాసం అయిన ప్రగతి భవన్ కు వెళ్లాలని పిలుపునిచ్చారు ఆకునూరి మురళి. తెలంగాణ రాష్ట్రంలో పొలం ఉండి, అమెరికాలో వ్యాపారం చేసుకునే, వ్యాపారస్తులకు లక్షల్లో రైతుబంధు రూపంలో కేసీఆర్ డబ్బులు ఇస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అదే సమయంలో కౌలు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని నిప్పులు చెరిగారు ఆకునూరి మురళి. ధనవంతులకే రైతుబంధు ఎందుకు ఇస్తున్నారని నిలదీశారు ఆకునూరి మురళి. కౌలు రైతులను పట్టించుకోవాలని, డిమాండ్ చేశారు. అసలు కేసీఆర్ డిక్షనరీలో కౌలు రైతులు అనే పదం లేనట్లు ఉందని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news