తెలంగాణపై మోడీ చేసిన వ్యాఖ్యలన్నీ అసత్యాలే – మంత్రి జగదీష్ రెడ్డి

-

ప్రధాని మోదీ వందే భారత్ రైలు ఓపెనింగ్ కి వచ్చి.. తెలంగాణపై విషం చిమ్మారని మండిపడ్డారు మంత్రి జగదీశ్ రెడ్డి. ప్రధాని మోడీకి విజన్ లేదని.. విజయాలు లేవని అన్నారు. తెలంగాణపై మోదీ చేసిన వ్యాఖ్యలన్నీ అసత్యలేనని అన్నారు జగదీశ్ రెడ్డి. మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో ఇప్పటికీ ఇంటింటికి తాగునీరు అందడం లేదని.. తెలంగాణలో మాత్రం ప్రతి ఇంటికి నీరు అందిస్తున్నామని చెప్పారు.

సిబిఐ, ఈడి కేసుల పేరిట విపక్ష నేతలను వేధిస్తున్నారని మండిపడ్డారు. బిజెపిలో చేరిన వారిపై మాత్రం ఎటువంటి కేసులు ఉండవని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధిని చూసి మోడీ ఓర్వలేకపోతున్నాడని.. సభలో ప్రజలను మోసం చేసే పద్ధతిలో మాట్లాడారని ఆరోపించారు. మోడీ పర్యటన వల్ల తెలంగాణకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు జగదీశ్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news