ఐపిఎల్ 2023: ఢిల్లీ టార్గెట్… 200 … గెలుస్తుందా !

-

రాజస్థాన్ బ్యాటింగ్ లో తమ పవర్ ఏమిటో చూపించింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్ లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. రాజస్థాన్ కు ఓపెనర్లు జైస్వాల్ మరియు బట్లర్ లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్ కు వీరిద్దరూ 51 బంతుల్లో 98 పరుగులు జోడించారు. ఆ తర్వాత జైస్వాల్ వేగంగా ఆడే క్రమంలో జైస్వాల్ ఔట్ అయిన తర్వాత స్కోర్ బోర్డ్ మందగించినా చివర్లో హెట్ మెయిర్ రాణించడంతో 199 పరుగులు చేరింది.

రాజస్థాన్ ఇన్నింగ్స్ లో బట్లర్ 79, జైస్వాల్ 60 , హెట్ మెయిర్ 39 పరుగులు చేసి భారీ ఇన్నింగ్స్ రావడంలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 2 వికెట్లు తీసుకోగా, కుల్దిప్ మరియు పావెల్ లు చెరో వికెట్ తీసుకున్నారు. రాజస్థాన్ ఇచ్చిన 200 టార్గెట్ ను ఢిల్లీ చేదిస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news