అల్లరి నరేష్ కొత్త చిత్రం..”ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం”!

-

“నాంది” ఇచ్చిన సక్సెస్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన అల్లరి నరేష్ ప్రస్తుతం “సభకు నమస్కారం” అనే సైటిరికల్ పొలిటికల్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు.ఇదే కాకుండా తన కెరియర్ లో 59 వ సినిమాను కూడా మొదలెట్టేశాడు.ఏ రాజ మోహన్ దర్శకత్వంలో తెలుగుఅమ్మాయి ఆనంది హీరోయిన్ గా రాబోతుంది.

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైంది.తాజాగా శ్రీరామనవమి సందర్భంగా సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” అనే టైటిల్ ప్రకటించి సినిమా మీద అటెన్షన్ క్రియేట్ చేసింది చిత్రయూనిట్.

ఈ సినిమా కూడా సక్సెస్ కొట్టి అల్లరి నరేష్ మళ్లీ ట్రాక్ మీదకి వస్తాడ అన్నది వేచి చూడాలి.అయితే కథల ఎంపిక, పేరడీలు ఎక్కువవడంతో ప్రేక్షకులకు ఆ కామెడీ మొహం మొత్తేసింది.దీంతో కాస్త విరామం తీసుకున్న అల్లరినరేష్ ఈసారి కామెడీ ని మించిన కధలే బలంగా సినిమాలతో వస్తున్నాడు.అలాగే గత ఏడాది వచ్చింది నాంది.ఓ సీరియస్ కథాంశంతో వచ్చిన నాంది నరేష్ తో పాటు కొత్త దర్శకుడు విజయ్ కనకమేడలకు సక్సెస్ ఇచ్చింది.ఈ కథను మెచ్చిన బాలీవుడ్ ఇప్పుడు రీమేక్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news