గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ధర్నా

-

అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన‘పుష్ప’ సినిమా ఊహించని వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో పాటలు , స్టైల్స్ అన్ని విపరీతంగా ఆదరణ పొందాయి.చాలా మంది క్రికెటర్లు కూడా పుష్ప మ్యానరిజంతో ఎన్నో వీడియోలు చేశారు. రీసెంట్ గా ఈ సినిమా ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు పుష్ప 2కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కానీ పుష్ప-2 పై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. ఈనెల ఆరంభంలోనే షూటింగ్ ప్రారంభమైందని చెప్తున్నా, ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. వాస్తవానికి ఈ ఏడాదిలోనే పుష్పా-2 మూవీ కూడా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, వివిధ కారణాలతో ఇప్పటివరకు కనీసం ఫస్ట్ లుక్ షెడ్యూల్ కూడా పూర్తవలేదు. దాంతో ఆగ్రహించిన అల్లు అర్జున్ అభిమానులు మైత్రి మూవీ మేకర్స్ తీరుని తప్పుబడుతూ కనిపించారు. దీంతో గీతా ఆర్ట్స్‌ ఆఫీసు ముందు ధర్నాకు దిగారు బన్నీ ఫ్యాన్స్‌. ఇదే ఫలితాన్ని కొనసాగిస్తూ నెక్స్ట్ మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని ఫ్యాన్స్ హెచ్చరిస్తూ కనిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news