అల్లు అర్జున్​ భార్యకు ఆ స్టార్ హీరోయిన్ అంటే కోపం!.. ఎవరో తెలుసా?

-

టాలీవుడ్​.. బాలీవుడ్​ ఏదైనా యువతరంలో విపరీతమైన క్రేజ్‌ ఉన్న కథానాయకుడు అల్లు అర్జున్‌. స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ, ప్రతి చిత్రానికి తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటారు.కాగా గత ఏడాది పుష్ప సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే.. పుష్ప 2 సినిమా షూటింగ్​ను గ్రాండ్​గా లాంచ్ చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే పూర్తి చేసాడు సుకుమార్.

అయితే ఇలాంటి టైంలో బన్నీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్​గా మారింది. నిజానికి బన్నీ తన కెరియర్​లో ఏ హీరోయిన్​తో నటించిన చాలా క్లోజ్​గా మూవ్ అవుతాడు… సరదాగా ఉంటాడు.. బన్నిది ఫ్రెండ్లీ నేచర్ అని చెప్పవచ్చు. ఇది మొదటి నుంచి బన్నికి ఉంది. అయితే ఇలా బన్నీతో ఓ హీరోయిన్ సరదాగా మాట్లాడేసరికి అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డికి కోపం వచ్చిందట. అసలు ఏం జరిగిందంటే… వాళ్ళిద్దరూ కలిసి నటించిన సరైనోడు సినిమా షూటింగ్ టైంలో బన్నీతో మరీ రాసుకొని పూసుకుని తిరుగుతూ మెసేజ్లు చేస్తూ ఉండేదట రకుల్. ఉదయం రాత్రి అని చూడకుండా బన్నీకి కాల్ చేసేదని గతంలో వార్తలు కూడా వినిపించాయి.

అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఓవర్ యాక్టింగ్ చూసి బన్నీ భార్య స్నేహారెడ్డికి కోపం వచ్చిందట. ఓ రోజు సరదాగా ఫ్యామిలీ మొత్తం ఔటింగ్​కి వెళ్ళిన టైం రకుల్ ప్రీత్ సింగ్ కాల్ చేసి అల్లు అర్జున్​తో గంటలు గంటలు మాట్లాడుతూ ఉన్నసమయంలో.. స్నేహకు కోపం వచ్చి.. ఫోన్ లాక్కోని కట్ చేసిందట. ఫ్యామిలీ టైమ్​ను సినిమా వాళ్లకి కేటాయించొద్దు అని వార్నింగ్ కూడా ఇచ్చిందట. ఎప్పుడైనా టీవీలో పిల్లలు పాటలు పెట్టుకున్న సరే ఆ పాటల్లో రకుల్ ప్రీత్ సింగ్ కనిపిస్తే వెంటనే టీవీ ఛానల్ మార్చేస్తుందట. అంతబ్యాడ్ ఇంప్రెషన్​ని క్రియేట్ చేసుకున్నింది రకుల్ ప్రీత్ సింగ్ అంటూ న్యూస్ వైరల్​గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news